తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ స్టేటస్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో విజయాల పరంపర ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు అదే ఉత్సాహంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు . ప్రస్తుతం ఇదే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలు అయిన ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే వారు సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అతడు , ఖలేజా వంటి క్లాసిక్ మూవీల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు బాగా పెరిగిపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది.  కాబట్టి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్లో భాగంగా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు.. అలాగే రెండవ షెడ్యూల్ కి సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం.  అయితే మహేష్ బాబు తాజాగా వెకేషన్ కి వెళ్ళగా చిత్ర యూనిట్ మాత్రం హైదరాబాదులో భారీ సెట్ నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సెట్ పూర్తయిన వెంటనే మహేష్ బాబు రాగానే సినిమా మొత్తం ఏకధాటిగా కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో విలన్ గా తెలుగు హీరోని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.  తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ఈ విషయాన్ని పొరపాటు చేయడం జరిగింది. ఆయన ఎవరో కాదు జగపతిబాబు.. ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని కూడా ఆయన వెల్లడించారు.  ఇకపోతే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: