ఐతే దాంట్లో భాగంగానే మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గుమ్మం ముందు నిలిచిన 'నాటు నాటు' సాంగ్ కు అవార్డు కచ్చితంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఐతే కొద్ది రోజుల క్రితమే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అలాగే ఆ సాంగ్ రాసిన చంద్రబోస్లకు ఆస్కార్ అవార్డుల స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ కోసం ఆహ్వానం అందిన విషయం గూర్చి అందరికి తెలిసిందే. ప్రెసెంట్ కీరవాణి, చంద్రబోస్ అమెరికా లోని లాస్ఏంజిల్స్లో ఉన్నారు. వాళ్ళు ఆస్కార్ కమిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చి పన్నెండున డాల్బీ థియేటర్ వేదికగా చేయబోతున్న లైవ్ పర్ఫార్మెన్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ వివరాల్ని వెల్లడించారు కీరవాణి. ఐతే ఇప్పటికే 'నాటు నాటు' సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయని తెలిపారు.
దీని గురించి కీరవాణి మాట్లాడుతూ ' లైవ్ పర్ఫార్మెన్స్ కోసం ఇండియా నుండి సింగర్స్ను తీసుకొస్తున్నాం. కానీ నృత్య బృందాన్ని మాత్రం ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసాం. ఐతే గుడ్ టీమ్ వర్క్తో లైవ్ పర్ఫార్మెన్స్ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాం' అని అన్నారు. కీరవాణి స్వరాల్ని అందించగా, చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' సాంగ్ వరల్డ్ వైడ్ గా సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. దానికున్న స్పెషలిటీ ఏంటంటే ఆ సాంగ్ అనేది హుషారైన బీట్, అర్థవంతమైన సాహిత్యంతో ఆకట్టుకుంది. ఐతే లేటెస్ట్ గా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్కు రెడీ అవ్వడంతో సినిమా లవర్స్ వారి యొక్క ఆనందాన్ని సోషల్ మీడియా వేదిక గా పంచుకుంటున్నారు.