సౌత్ హీరోయిన్ గా పేరుపొందిన అమలాపాల్ దక్షిణాది ఆడియన్స్ లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే పలు విభిన్నమైన కథ చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక సొంతంగా ఒక బ్యానర్ ని కూడా నిర్మించినట్లు వార్తలు అందులో పలు సినిమాలను తెరకెక్కించడం జరుగుతోంది.నిన్నటి రోజున శివరాత్రి సందర్భంగా అమలాపాల్ ఆధ్యాత్మిక సేవలు మునిగి తేలుతున్నది. ఈ క్రమంలోని ఇండోనేషియాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించడం జరిగిందట. అక్కడే ఉన్న దేవాలయానికి చెందిన ఒక కొలనులో స్నానం చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

ఈ ఫోటోలలో ఎర్రటి వస్త్రాలు ధరించిన అమలాపాల్ కొలనులో జలకాలాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. తన తడిసిన అందాలతో కుర్రకారులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలను పంచుకుంటూ అమలాపాల్ ఒక కొటేషన్ ని సైతం రాసుకొచ్చింది. నేను మార్చలేని వాటిని అంగీకరించేందుకు నాకు ఈ నీటి ద్వారా శక్తి కావాలి నేను చేయగలిగిన వాటికోసం అవసరమైన శక్తి ధైర్యం కావాలి అంటూ ఈ ఫోటోలకు సైతం క్యాప్షన్  రాసుకురావడం  జరిగింది.
ఇక అమలాపాల్ క్రిస్టియన్ మతానికి చెందినప్పటికీ హిందూ ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటుంది. హిందూ దేవుళ్లను గౌరవించడం పట్ల ఆమెను పలువురు అభిమానులు సైతం అభినందిస్తున్నారు. ఇక అమలాపాల్ కెరియర్ విషయానికి వస్తే తెలుగు లో చివరిగా పిట్ట కథలు సినిమాలు నటించింది. ఆ తర్వాత మలయాళ, తమిళం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ తో కలిసి భోళా లో స్పెషల్ అప్పీరెన్స్ తో ఆకట్టుకోబోతోంది. అమలాపాల్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక అప్పటినుంచి ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెడుతోంది అమలాపాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: