ఆర్ఆర్ఆర్ సినిమా భారత సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఆస్కార్ రేసులోనూ ఇది ముందు వరుసలో ఉంది. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. అతడు తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు కేజీఎఫ్ సినిమాలతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో సినిమా అనగానే అందరి అటెన్షన్ దీనిపై పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సినిమాలు కన్నడ సినిమా స్థాయిని పెంచాయి. దీంతో ప్రశాంత్ నీల్‌ తీసే తర్వాత సినిమాలన్నీ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌తో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పటికే చాలా భాగం పూర్తయిపోయింది. మరో మూడు నెలల్లో సినిమా మొత్తం పూర్తి కానుంది. ఇక ఎన్టీఆర్‌తో తెరకెక్కించనున్న సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే ఇటీవలే తారకరత్న చనిపోవడంతో ఎన్టీఆర్ విషాదంలో మునిగిపోయాడు. ఇక మరో వైపు ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నాడు. అయితే మూడు నెలల్లో ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభమయ్యే నాటికి ఇది పూర్తవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. దీన్ని బట్టి చూస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్ ది కాదు ఎన్టీఆర్ దే ఆలస్యం అన్నది అర్థమవుతుంది. ఒక్కసారి ప్రశాంత్ నీల్ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తే అది శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ రెడీగానే ఉన్నాడని, అయితే ఎన్టీఆర్‌దే ఆలస్యమని తెలుస్తోంది. మరో వైపు ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఈ సినిమా రేంజ్ అమాంతంగా పెరిగి పోతుందనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: