మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రామ్ చరణ్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ కావడం.. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఇక త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక విదేశాల్లో సైతం రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



 ఈ క్రమంలోనే అమెరికా ప్రమోషన్స్ లో భాగంగా త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రామ్ చరణ్. ఈ సినిమా హిట్ అవుతుందని అందరికీ నమ్మకం ఉంది. కానీ మా ఊహకు మించి ఈ చిత్రం విజయం సాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదలై సంవత్సరం గడిచిపోతున్న ఇంకా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఇండియాకు స్టీవెన్ స్టీల్ బర్గ్ లాంటివాడు అంటూ తెలిపాడు. ఇక అదే సమయంలో తన తండ్రి చిరంజీవి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 మేము ఫ్యామిలీ అంతా ఒక్కచోట కలుసుకున్నప్పుడు సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోము అంటూ తెలిపాడు. సినిమాల గురించి మరిచిపోయి కేవలం ఫ్యామిలీ విషయాలను మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం అంటూ చెప్పుకొచ్చాడు. బయట ఎలా ఉన్నా మా నాన్న ఇంట్లో చాలా సాధారణంగా ఉంటారు. అందుకేనేమో మా ఇంట్లో నాన్న సినిమాలకు సంబంధించిన ఫోటోలు చాలా తక్కువగా ఉంటాయి అంటూ చరణ్ తెలిపాడు. కాగా మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపును సంపాదించుకొని.. చిరంజీవికి సైతం సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ గా కొనసాగుతూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: