అయితే నరసింహుడు సినిమా విడుదల ఆగిపోతే జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఫైనాన్షియర్లకు కట్టి ఈ సినిమాను అప్పట్లో విడుదల చేయించారు. ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్ల ఈ సినిమా విడుదల కు ఇబ్బందులు ఎదురు కాగా ఎన్టీఆర్ ఈ విధంగా చేశారు. అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేక పోయింది.
కన్నడ సినిమా స్క్రిప్ట్ కు మార్పులు చేసి తెలుగు లో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. సినిమాలో ఎన్టీఆర్ కొంత సమయం పాటు మాటలు రాకుండా నటించడం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అయిందని తెలుస్తుంది.ఈ సినిమా షూట్ సమయంలో మూవీ అనుకున్న విధంగా రావడం లేదని బి.గోపాల్ కూడా భావించారట. నరసింహుడు సినిమా ఫలితం ఎన్టీఆర్ ను ఎంతో బాధ పెట్టింది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బి.గోపాల్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ సినిమాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై బాగా దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ కూడా పెరుగుతుండగా ఎన్టీఆర్ త్వరలో తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానున్నారని తెలుస్తుంది.. ఇటీవల ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి అమెరికా కూ వెళ్ళాడు.