టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య బాబు కి ఉన్నా మాస్ క్రేజ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పానక్కరలేదు. ఐతే ఈ మధ్య కాలంలో ఆయన ఎం మాట్లాడిన తెగ వైరల్ అవుతుంది. దాంట్లో భాగంగానే 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యాటగిరీ లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కినందుకు గాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రతీ సెలబ్రిటీ శుభాకాంక్షలు వెల్లువ ముంచి ఎత్తుతున్నారు.బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రిటీ ఇది మా సినిమా అని అనుకునేలా చేసింది ఆర్ ఆర్ఆర్ చిత్రం.అయితే అందరి శుభాకాంక్షలు లోను ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న కీరవాణి మరియు చంద్రబోస్ తో పాటుగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పేర్లను కూడా ప్రస్తావించి శుభాకాంక్షలు తెలియజేసారు.

కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం అటు ఎన్టీఆర్ పేరు కానీ,ఇటు రామ్ చరణ్ పేరు కానీ తియ్యలేదు.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చకి దారి తీసింది.జూనియర్ ఎన్టీఆర్ పేరు పలకడం ఇష్టం లేక రామ్ చరణ్ పేరు ని కూడా ప్రస్తావించకుండా బాలయ్య బాబు తెలిపిన శుభాకాంక్షలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ప్రపంచం లోనే అత్యున్నత అవార్డ్స్ అయినా ఆస్కార్స్ గెలిచినందుకు గాను ఆర్ఆర్ఆర్ మూవీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యాటగిరిలో 'నాటు నాటు' పాటకి అవార్డు లభించడం అనేది భారతీయ సినీ చరిత్ర లో అద్భుతమైన ఘట్టం.ఇది కేవలం తెలుగు జాతి మాత్రమే కాదు, మన దేశం మొత్తం గర్వించదగ్గ విషయం.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కి, లిరిక్ రైటర్ చంద్ర బోస్ కి మరియు ఆర్ఆర్ఆర్ మూవీ టీం కి నా శుభాకాంక్షలు, అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం గా అవార్డు గెలిచినందుకు గాను 'ఎలిఫెంట్ విష్పర్స్' కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అంటూ బాలయ్య బాబు ఈ సందర్భంగా మాట్లాడాడు.అంత బాగానే ఉంది కానీ హీరోల పేర్లు తియ్యకపోవడమే కాస్త ఇబ్బంది కలిగించింది అని అంటున్నారు అభిమానులు.

కానీ ప్రతిసారి ఈ విధంగా తన అభిమాన హీరో గురించి ఇలా మాట్లాడడం అసలు ఎం బాగాలేదని ఆయన ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. బాలయ్య బాబు కావాలని అలా ఎపుడు అనరని అదంతా యాద్రుచ్చికంగా జరుగుతుందని వాళ్ళ అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ దీన్ని దయ చేసి వైరల్ చేయొద్దని ఆయన అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: