అల్లు అర్జున్ హీరోగా సుకుమార్  దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న పుష్ప 2 చిత్రానికి ఆస్కార్ వస్తుంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది.

ఆస్కార్  అనేది ఏ సినిమా పడితే ఆ సినిమా కి ఇస్తారా అంటూ కొందరు కామెంట్ కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అత్యుత్సాహం తో తమ హీరో సినిమా కు..తమ హీరో కి ఆస్కార్ అవార్డు వస్తుందని ఎదురు చూస్తున్నారటా.కానీ అన్ని సినిమాలు ఆస్కార్ వరకు వెళ్ళలేవు అలాగే అన్ని పాటలు నాటు నాటు పాట మాదిరిగా ఆస్కార్ అవార్డులను తెచ్చి పెట్టలేవు అంటూ కొందరు సోషల్ మీడియా లో ఈ సందర్భంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు తమ సినిమా ను పంపించక పోతే నేరుగా రాజమౌళి వెళ్లినట్లు  వెళ్తామని సుకుమార్, అల్లు అర్జున్ వెళితే బొక్క బోర్లా పడడం ఖాయమని కొందరు చెప్తున్నారు.. అంతే కాకుండా ఆస్కార్ అకాడమీ ముందు పరువు పోవడం ఖాయం అంటూ కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.

సినిమా విడుదలైన తర్వాత బాగుంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆస్కార్ వరకు తీసుకెళ్తారని కొందరు అయితే వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఒక వీడియో మరియు పోస్టర్ సినిమా స్థాయిని అమాంతం పెంచడం జరిగిందని తెలుస్తుంది.. ముఖ్యంగా అల్లు అర్జున్ యొక్క అర్థ నారీశ్వరుడి పోస్టర్ సినిమా కు మంచి హీట్ పెంచినట్లుగా ఉంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమం కూడా శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం సినిమా యొక్క విడుదల తేదీన ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఏడాది పాటు సినిమా  షూటింగ్ జరుగుతూ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అల్లు అర్జున్ మరియు సుకుమార్ టీం నిర్ణయించారటా.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ సినిమా ను నిర్మిస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: