టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మరియు మీటర్ అనే మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటగా ఈ హీరో ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొంది మంచి విజయం అందుకుంది. ఇలా ఈ మూవీ తో మంచి విజయం అందుకున్న ఈ యువ హీరో తాజాగా మీటర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ కి రమేష్ కాడురి దర్శకత్వం వహించగా ... సాయి కార్తీక్మూవీ కి సంగీతం అందించాడు. రవి ఆతుల్య ఈ మూవీ లో కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అవడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దట్టడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను కూడా ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ఈ సంస్థ జెమినీ టీవీ కి అమ్మి వేసినట్లు ... అందులో భాగంగా కొంత కాలం తర్వాత ఈ మూవీ ని జెమిని టివి లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని చిరంజీవి , హేమలత పెదమల్లు లు సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: