తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ మణులలో ఒకరు అయినటు వంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో కుర్ర కారు ప్రేక్షకులను కట్టి పాడేయడం మాత్రమే కాకుండా ... తన నటన తో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. దానితో ఈ ముద్దు గుమ్మకు వరస సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కాయి. అందులో భాగంగా అరుంధతి మూవీ తో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. 

అలాగే ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా అనుష్క క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో నవీన్ పోలిశెట్టి హీరో గా నటిస్తూ ఉండగా ... అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యూ వీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" హక్కులను "ప్రత్యంగిరా సినిమాస్" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకోని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: