మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. సుకుమార్ ఈ సినిమాకి కథని అందించడం జరిగింది. ఈ చిత్రం ఈనెల 21న విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇందులో ప్రతి ఒక్కరి నటన చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంశాలు అందుకుంది.


ముఖ్యంగా హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండడంతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యిందని చెప్పవచ్చు. మొదట ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయడం జరిగింది. తెలుగులో సక్సెస్ అయితే ఇతర భాషలలోకి విడుదల చేసినందుకు ప్రయత్నిస్తామని తెలియజేశారు చిత్ర బంధం. తాజాగా ఇతర భాషలలో కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


అందుతున్న సమాచారం ప్రకారం మే 5వ తేదీన విరుపాక్షి సినిమా బాలీవుడ్ తమిళంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో కిసికా భాయ్ కిసికా జాన్ సినిమా విడుదలయ్యి డిజాస్టర్ గా మిగిలింది సల్మాన్ ఖాన్ కెరియర్ లోని ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇందులో పూజా హెగ్డే కూడా నటించింది. వెంకటేష్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకులకు కూడా పెద్దగా పట్టించుకోలేదని సమాచారం అందుచేతనే విరూపాక్ష సినిమా విడుదలయితే కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిస్ అవుతుంది అంటూ చిత్ర బృందం భావించి ఈ సినిమాలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళంలో మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: