తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చత్రపతి సినిమాతో హిందీలో ఎంట్రి ఇవ్వగా ఈ సినిమా గత శుక్రవారం రోజున చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. టాలీవుడ్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించారు.. బాలీవుడ్ చిత్రాన్ని మాత్రం డైరెక్టర్ వివి వినాయక్ రీమేక్ చేయడం జరిగింది. పెన్ స్టూడియో సమస్త ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

ఫుల్ లెన్త్ యాక్సిడెంట్ గా వచ్చిన చత్రపతి సినిమా ఉత్తరాదిలో ఆశించిన రీతిలో పాజిటివ్ టాక్   రాబట్టకోలేకపోయింది..దీంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్  స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.. బాలీవుడ్ లో ట్రెండ్ వర్గాల సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చత్రపతి మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలలో రూ.60 లక్షలు నెట్టు వసూలు మాత్రమే దక్కాయని అలాగే రూ.90 లక్షలు గ్రాస్ వసూలు మాత్రమే వచ్చిందని ఈ మధ్యకాలంలో ఏ హిందీ చిత్రానికి కూడా మొదటి రోజు ఇంత తక్కువ కలెక్షన్ రాబట్టలేదని టాక్ వినిపిస్తోంది.


అంతేకాకుండా చత్రపతి సినిమాకు ఇండియాలోనే కొన్ని ప్రాంతాలలో అసలు స్పందన కూడా రాలేదని దీంతో ఈ చిత్రం కొన్ని ఏరియాలలో జీరో కలెక్షన్లు కూడా రాబట్టాయని.. ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తంగా డబ్బింగ్ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించిన సాయి శ్రీనివాస్ డైరెక్ట్ మూవీతో థియేటర్లను రప్పించుకోలేకపోయారని మరి కొంతమంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకుంటోంది. మరి ఏ మేరకు కలెక్షన్లు రాబడతాయో చూడాలి మరి. టాలీవుడ్ లో చివరిగా రాక్షసుడు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: