దుబాయ్ లో చాలా గ్రాండ్గా సైమా అవార్డ్స్ 2025 వేడుకలు జరిగాయి. ఇందులో పుష్ప 2 చిత్రానికి అవార్డులు రావడంతో అందుకోవడానికి అల్లు అర్జున్, రష్మిక తో పాటు డైరెక్టర్ కూడా వచ్చారు. ఈ వేడుకలో రష్మిక హైలెట్ గా కనిపించింది. సైమా ఈవెంట్లో రష్మికకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది..గత మూడేళ్లుగా విజయ్ ,రష్మిక సీక్రెట్ గా డేటింగ్ చేసుకుంటున్నారనే రూమర్స్ టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించేవి. ఈ జంట బయట కనిపించిన ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో వీరి గురించి ఏదో ఒక విషయంలో మాట్లాడుకునేలా చేస్తూ ఉంటారు.


ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్షిప్ కి మరింత బలం చేకూర్చేయేలా ఒక న్యూస్ వినిపిస్తోంది. సైమా అవార్డుల కోసం దుబాయ్ కి వెళ్లిన రష్మిక చేతికి ఒక ఉంగరం వంటిది కనిపించింది. దుబాయ్ కి రావడానికి ముందే రష్మిక ముంబైకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ కు చేయి ఊపుతూ ఉండగా ఆమె మూడో వేలికి ఉంగరం కనిపించింది. ఈ రింగ్ గతంలో హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉండేది.. ఆ రింగ్ రష్మిక వేలికి ఉండడంతో ఎంగేజ్మెంట్అయిపోయిందా అనే విధంగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



సైమా అవార్డు వేడుకలకు రష్మిక చీర కట్టులో రాగా.. ఆ ఉంగరాన్ని తన చిటికిన వేలికి మార్చుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన తర్వాత అభిమానులు, నేటిజన్స్  ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. మరి గుట్టు చప్పుడు కాకుండా రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా ?అనే అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అటు రష్మిక కానీ, విజయ్ దేవరకొండ కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: