తెలుగు ఇండస్ట్రీలో కొంత కాలం నుంచి పరభాష హీరోయిన్లు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో కన్నడ బ్యూలీ మాధవి లత 2008 లో రవిబాబు దర్శకత్వంలో ‘నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రం పెద్దగా హిట్ కాలేదు.. ఆతర్వాత నాని నటించిన ‘స్నేహితుడా’ లో నటించింది.. ఈ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించలేదు.  తర్వాత అరవింద్ 2 చిత్రంలో నటించింది.. థ్రిల్లర్ కథా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.  అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పిన నటిగా సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.  తర్వతా శ్రీరెడ్డి తెరపైకి తీసుకు వచ్చిన కాస్టింగ్ కౌచ్ కి ఆమెకు కూడా మద్దతు పలికారు.  ఇక ఇండస్ట్రీలో తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బీజేపీ లో చేరారు మాధవీలత.

 

అప్పట్లో పవన్ కళ్యాన్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవిలత. ఎప్పుడూ సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉండే మాధవి లత తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారారు.  ఇటీవల  ఓ టీవీ చానల్ తో రేణుక మాట్లాడుతూ, ప్రధాని మోదీని గతి తప్పిన ఏనుగుతో పోల్చారు. తాజాగా ఈ వాఖ్యలపై నటి, బీజేపీ నాయకురాలు మాధవి లత తనదైన స్టైల్లో రేణుకా చౌదరిపై విమర్శలు గుప్పించారు.  మేడమ్... మాకు ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే మేము బ్రిటీష్ కౌంటీలకు చెందినవారము కాదు.

 

ఇండియాలో పుట్టి, ఇక్కడే పెరిగాము.  ఇక భారత దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం ఉద్దరించింది.. పేదరికాన్ని సమూలంగా రూపుమాపిందా? మన దేశంలోని ప్రజలు ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గుతున్నారు? దీనికి కారణం మీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? దేశంలో ఓ చెత్త బుట్టలాంటి పార్టీ మీది అంటూ విమర్శించారు. అంతే కాదు ప్రధాని మోదీ ఈ చెత్తను ఊడ్చేయడానికి కంకణం కట్టుకున్నారు.. దేశాన్ని స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దుతారు అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: