బర్డ్ ఫ్లూ మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బర్డ్ ఫ్లూ మీద మేము అలెర్ట్ గా ఉన్నాము అని అన్నారు. సంగారెడ్డి తో పాటు కొన్ని జిల్లాల్లో కోళ్లు చనిపోయాయి అని ఆయన అన్నారు. వాటికి టెస్ట్ లు చేసాము బర్డ్ ఫ్లూ తో చనిపోలేదు అని ఆయన ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలి అని ఆయన కోరారు. మన రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ రాదు అని ఆయన స్పష్టం చేసారు. ఫౌల్ట్రీ ఇండస్ట్రీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది అని ఆయన అన్నారు. కోడి గుడ్డు, కోడి కూర వేడిగా వండుకుని తింటాము అని... కాబట్టి కోడి కూర, కోడి గుడ్డు తినడం వలన బర్డ్ ఫ్లూ రాదు అని ఆయన అన్నారు.
పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్ మాట్లాడతూ... బర్డ్ ఫ్లూ మనుషులకు రాదని శాస్త్ర వేత్తలు నిర్దారించారు అని అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో కోళ్లు చనిపోయాయని అన్నారో అక్కడ అన్ని రకాల టెస్ట్ లు చేశాము అని ఆమె పేర్కొన్నారు. అక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాల తో కోళ్లు చనిపోలేదు అని... 276 ప్రాంతాలల్లో కోళ్లకు టెస్ట్ లు చేసాము ఎక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనపడలేదు అని ఆమె వెల్లడించారు.