ఇప్పటివరకు ఫ్రాన్స్ నుంచి ఏకంగా పదకొండు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది భారత్ ఇక 11 రాఫెల్ యుద్ధ విమానాలతో భారత వాయుసేన మరింత పటిష్టంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానాలు కూడా భారత్ లో కొనసాగుతున్నాయి. మరోవైపు అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపనులను అభివృద్ధిచేసి ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తూ భారత్ మరింత పటిష్టంగా మారుతుంది. అదే సమయంలో అగ్రరాజ్యాలతో దౌత్య పరంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల భారత్ మరో ముందడుగు వేసింది. ఏకంగా అత్యవసర వినియోగం కోసం అమెరికా నుంచి ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన యుద్ధ విమానాలను కోసం ఆర్డర్ ఇవ్వగా ఇక అత్యవసర వినియోగం కోసం యుద్ధవిమానాల ఇచ్చేందుకు జో బైడెన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది . అయితే ఇప్పటికే తమ దగ్గర ఉన్న జే17యుద్ధ విమానాలు రాఫెల్ యుద్ధ విమానాల కంటే శక్తివంతమైనవి అని చైనా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు అమెరికా నుంచి యుద్ధ విమానాలు భారత్లోకి అత్యవసర వినియోగం కోసం వస్తుండడంతో భారత వాయుసేన మరింత పటిష్టవంతంగా మారింది అని విశ్లేషకులు అంటున్నారు.