భూ కబ్జాలు చేయటంలో కవిత తన అన్న కేటీఆర్ ను మించిపోయింది అని మండిపడ్డారు. అన్నా .. చెల్లెళ్ళు తెలంగణ సమాజానికి ప్రమాదకరంగా మారారు అని ఆరోపించారు. బాలీవుడ్ మత్తు నుంచి కేటీఆర్ బయటకు రావాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఓటు బ్యాంకు రాజకీయల కోసం కేసీఆ, కేటీఆర్ లు హిందువుల ప్రాణాలను పణంగా పెడ్తున్నారు అని అన్నారు. గతంలో అల్లర్లు చేసిన వారిని శిక్షించకపోవటం వలనే వరుస ఘటనలు జరుగుతున్నాయని, మహమూద్ అలీ చేతకాని హోంమంత్రి. మస్లింలకు మాత్రమే చికిత్స అందిస్తున్నాడు అని విమర్శించారు.
చేతకాకుంటే లా అండ్ ఆర్డర్ ను మాకు అప్పజెప్పండి. ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సాయంలో బైంసా నుంచి హిందువులను తరిమేయటానికి ఎంఐఎం ప్రయత్నాలు చేస్తోంది అని మండిపడ్డారు. గట్టు మైసమ్మ కోనేరు పూడ్చి బయట నుంచి వచ్చిన ముస్లింలకు ఇళ్ళు కట్టించటం అన్యాయంఅని మండిపడ్డారు. హిందు శ్మశానవాటికను సైతం బైంసాలో ముస్లిం ఆక్రమించారు అని ఆరోపించారు. గద్దె దిగిన తర్వాత మహేష్ భగవత్ తోనే కేసీఆర్, కేటీఆర్ కు బేడీలు వేయిస్తాం అని, మత్తులో సీఎం కేసీఆర్ తన మతాన్ని మర్చిపోయాడు అని విమర్శించారు. పరమత సహనం హిందు ధర్మంతోనే సాధ్యమని పాలకులు గుర్తుంచుకోవాలి అని సూచించారు.