ప్రపంచంలోని అన్ని వస్తువుల కంటే ప్లాస్టిక్ వస్తువులే పర్యావరణానికి ముప్పుగా మారాయి. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి భారీ హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమిలో కలిసిపోవడానికి వెయ్యేళ్ల కాలం పడుతుందని.. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుందని సైంటిస్ట్ లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్లాస్టిక్ ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. అంతేకాకుండా లక్షలాది జీవరాశులకు ఆశ్రయమైన సముద్రాలు, మహాసముద్రాల్లో ప్లాస్టిక్ ని పారేస్తున్నారు. చెత్తను సరిగా డంప్ చేయని దేశాలన్నీ కూడా సముద్రాలను డస్ట్ బిన్ గా చేస్తున్నాయి. దీనివల్ల జీవరాశులు చనిపోతున్నాయి. ఇక ప్రపంచం మొత్తంలో సముద్రాల్లో అత్యధికంగా ప్లాస్టిక్‌ను పారేసే టాప్ 10 దేశాలు ఏంటో తెలుసుకుంటే..



ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదికి లక్షల కిలోల్లో ప్లాస్టిక్ వ్యర్థ డంప్ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఒక సంవత్సరానికే కోటి కిలోలకు పైగా ప్లాస్టిక్ డంప్ చేస్తున్నారు. చెత్త మేనేజ్మెంట్ విషయంలో ఏ దేశాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుంటే..



1. భారతదేశం - 126.5 మిలియన్ కిలోల ప్లాస్టిక్

2. చైనా - 70.7 మిలియన్ కిలోల ప్లాస్టిక్

3. ఇండోనేషియా - 56.3 మిలియన్ కిలోల ప్లాస్టిక్

4. బ్రెజిల్ - 38 మిలియన్ కిలోల ప్లాస్టిక్

5. థాయిలాండ్ - 22.8 మిలియన్ కిలోల ప్లాస్టిక్

6. మెక్సికో - 3.5 మిలియన్ కిలోల ప్లాస్టిక్

7. ఈజిప్ట్ - 2.5 మిలియన్ కిలోల ప్లాస్టిక్

8. యునైటెడ్ స్టేట్స్ - 2.4 మిలియన్ కిలోల ప్లాస్టిక్

9. జపాన్ - 1.8 మిలియన్ కిలోల ప్లాస్టిక్

10. యునైటెడ్ కింగ్డమ్ - 7,03,000 కిలోల ప్లాస్టిక్




అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనా దేశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ సరిగా లేదని తెలుస్తోంది. ఇకనైనా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. పేలవమైన వెస్ట్ మేనేజ్మెంట్ వీడాలి. ఇప్పుడే భవిష్యత్తులో ఎటువంటి ప్రకృతి పర్యావరణాలు ఎదురుకోము.

మరింత సమాచారం తెలుసుకోండి: