ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఓ వైపు ఎన్నికల్లో గెలిచామనే గర్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాలర్ ఎగురవేస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే... గెలుపు మాదే అంటున్నారు. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. సభలో తనకు తీవ్ర అవమానం జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో మళ్లీ గెలిచిన తర్వాతే సభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో సభలో తన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఎంతో హుందాగా ఉన్నామన్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం తమను రెచ్చిగొట్టేలా మాట్లాడుతున్నారు. కానీ తాము మాత్రం సహనంతోనే ఉన్నామన్నారు చంద్రబాబు. బూతులు తిట్టడం తమకు వచ్చన్నారు. కానీ ఇప్పుడు తమ కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అండగా నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తన తాత నందమూరి తారక రామారావు స్థాపించారని... ఈ కట్టె కాలే వరకు తాను తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటామని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను తప్పకుండా వచ్చి ఆదుకుంటానన్నారు కూడా. ఇప్పుడు అదే సమయం వచ్చినట్లుంది. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని... అంతే కాని ఆడవారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. మరో వైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా అసెంబ్లీలో జరిగిన వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP