వ్యాపారంతో పాటు ఇంకొన్ని రాజకీయాంశాలు కూడా బాగుంటే ఆశ్రమ నిర్మాణాలకు విరాళాలు, భారీ కానుకల చదివింపులు అన్నవి జరిగిపోతూనే ఉంటాయి. ఆ విధంగా చెవిరెడ్డి తో సహా చాలా మంది మన స్వామీజీకి బాగానే చెల్లింపులు చేశారనే అనుకుంటున్నారు. ఆ విధంగానో ఏ విధంగానో కొత్త ఆశ్రమానికి విరాళాలకు పెద్దగా లోటేం లేదు. మొత్తం ఆశ్రమం విలువే వెయ్యి కోట్లు. స్థలం వంద ఎకరాలకు పైగా.. అటు కేసీఆర్ కు ఇటు జగన్ కు ఏక కాలంలో నచ్చిన స్వామీజీ ఆయనొక్కరే కావడం మరో విశేషం. దీంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 108 ఆలయాలు ఇక్కడి ప్రాంగణాలు అత్యంత సులువుగా కొలువు దీరాయి. ఆఖరికి రామోజీకి కూడా చేతగాలేదు.. ఆయన ఆధ్యాత్మికత పేరిట నెలకొల్పాలనుకున్న ఓం సిటీ ఎందాక వచ్చిందో కానీ అంతకుమించిన పేరు మరియు వైభవం జియరు స్వామి దక్కించుకున్నారు. కనుక స్వామీజీ అందరి వాడు కానీ జగన్ మాత్రం కొందరి వాడు ఇప్పటికీ మరియు ఎప్పటికీ .. ఎనీ డౌట్స్ !
వ్యాపారంతో పాటు ఇంకొన్ని రాజకీయాంశాలు కూడా బాగుంటే ఆశ్రమ నిర్మాణాలకు విరాళాలు, భారీ కానుకల చదివింపులు అన్నవి జరిగిపోతూనే ఉంటాయి. ఆ విధంగా చెవిరెడ్డి తో సహా చాలా మంది మన స్వామీజీకి బాగానే చెల్లింపులు చేశారనే అనుకుంటున్నారు. ఆ విధంగానో ఏ విధంగానో కొత్త ఆశ్రమానికి విరాళాలకు పెద్దగా లోటేం లేదు. మొత్తం ఆశ్రమం విలువే వెయ్యి కోట్లు. స్థలం వంద ఎకరాలకు పైగా.. అటు కేసీఆర్ కు ఇటు జగన్ కు ఏక కాలంలో నచ్చిన స్వామీజీ ఆయనొక్కరే కావడం మరో విశేషం. దీంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 108 ఆలయాలు ఇక్కడి ప్రాంగణాలు అత్యంత సులువుగా కొలువు దీరాయి. ఆఖరికి రామోజీకి కూడా చేతగాలేదు.. ఆయన ఆధ్యాత్మికత పేరిట నెలకొల్పాలనుకున్న ఓం సిటీ ఎందాక వచ్చిందో కానీ అంతకుమించిన పేరు మరియు వైభవం జియరు స్వామి దక్కించుకున్నారు. కనుక స్వామీజీ అందరి వాడు కానీ జగన్ మాత్రం కొందరి వాడు ఇప్పటికీ మరియు ఎప్పటికీ .. ఎనీ డౌట్స్ !