ఇక "రాష్ట్రాలకు రాష్ట్రాలు మీ నుంచి దూరమవుతున్నాయి. అసలు మీ జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా లేరు. అయినా కాని మీకు అహంకారం అనేది పోలేదు" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన కామెంట్స్.అలా అన్నారో లేదో కాంగ్రెస్ కి మళ్ళీ షాక్ తగిలింది.ఇక ఈశాన్య ప్రాంత రాష్ట్రమైన మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని భారీ షాక్ అనేది తగిలింది. ఆ పార్టీలోని ఐదుగురు ఎమ్మెల్యేలు కాన్రాడ్ కే సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్(ఎండీఏ)లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. ఇక ఈ మేరకు మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మాకు లేఖ అందజేయడం అనేది జరిగింది.కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అంపరీన్ లింగ్డో మేరాబోర్ సీయం మోహెన్డ్రో రాప్సాంగ్ కిమ్ఫా మార్బనియాంగ్ పీటీ సాక్మి ఎండీఏలో చేరుతున్నట్లు లేఖ ద్వారా వెల్లడించడం జరిగింది.

ఇక ఇదే లేఖను కాంగ్రెస్ అధినేత్రి అయిన సోనియా గాంధీకి కూడా పంపారు.మేఘాలయ డెమొక్రటిక్ కూటమిలో చేరాలని మేము ఎంతో ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. మా సపోర్ట్ తో ఎండీఏ మరింత బలపడుతుందని రాష్ట్రాన్ని ముందుకుతీసుకెళ్తుందని ప్రజల ఆశయాలను నెరవేరుస్తుందని మేము ఆశిస్తున్నాం. అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ లేఖలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఎండీఏలో చేరడం వల్ల.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మేఘాలయలో ఒక ప్రధాన ప్రతిపక్షం అయింది.2018  వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక ఆ తర్వాత ఇద్దరు నేతలు చనిపోవడం వల్ల ఉపఎన్నికలు కూడా నిర్వహించారు. దీంతో ఆ రెండు స్థానాలను కూడా దెబ్బకు నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) కైవసం చేసుకుంది. గత సంవత్సరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మిగిలి ఉన్న ఐదుగురు కూడా ఎండీఏలోకి వెళ్తున్నారు. 2023 వ సంవత్సరంలో మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: