డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షాజీద్ ఖాన్ ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెరాస పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని..బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టి మూడురోజులైనా అరెస్టు చేయకపోగా...దోషిగా తేలితేనే పార్టీ నుంచి బహిష్కరిస్తామనడం సిగ్గు చేటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.


మైనర్ బాలిక అత్యాచారం అంశంలో తెరాస నేతల తీరును చూస్తుంటే ఈ అరాచకాలను సమర్ధిస్తున్నారని అర్ధమవుతోందని.. తెరాస మార్క్ సెక్యూలరిజానికి ఈ దారుణ ఘటన ఓ పరాకాష్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆనాడు రజాకార్లు మహిళలను చెరుపుతుంటే నిజాం రాజు మౌన పాత్ర వహించినట్లుగానే ఈనాడు తెరాస నేతలు బాలికలను, మహిళలను చెరిపేస్తుంటే.. ఈ నయా నిజాం కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తుండటం హేయనీయం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఘాటు పదజాలంతో మండిపడ్డారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..” మానవ మృగాన్ని ఇప్పటికైనా పార్టీ నుండి బహిష్కరించే సాహసం చేయలేకపోవడం అత్యంత దారుణం. నేటి నయా నిజాం పాలనకు నిదర్శనమిదే. తెరాస పాలనలో వెలుగు చూసిన ఇలాంటి సంఘటనలు కొన్ని మాత్రమే.. వెలుగు చూడని ఘటనలు కోకొల్లలు. గతంలో హైదరాబాద్ నడిబొడ్డున చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో హోంమంత్రి నివాసానికి సమీపంలోనే దళిత మహిళపై ఎంఐఎం నేత అత్యాచారం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించిన ప్రభుత్వం కేసు కూడా నమోదు చేయలేదని బండి సంజయ్ గుర్తు చేశారు.


కేసీఆర్ మార్క్ నూతన రాజ్యాంగం అంటే ఇదేనేమో... కల్వకుంట్ల రాజ్యాంగానికి అభం శుభం తెలియని బాలికలు బలవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులు తెరాస కార్యకర్తలకు భయపడుతుండటం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: