మీరు ఇంకా మీ రేషన్ కార్డును కనుక ఆధార్‌తో లింక్ చేయకపోతే త్వరపడండి. ఇప్పుడు కేంద్రం వారికి మరోక మంచి అవకాశాన్ని కల్పించింది.ఇక ఇంతకుముందు రేషన్‌ కార్డ్ ను ఆధార్‌ కార్డ్ తో లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31గా నిర్ణయించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు దానిని జూన్ 30 వ తేదీ వరకు కూడా పొడిగించారు. దీని కోసం ఆహారం ఇంకా అలాగే ప్రజాపంపిణీ శాఖ నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. ఇక మనం ఇంట్లో కూర్చొని ఆధార్‌ కార్డ్ తో రేషన్‌ కార్డ్ ను ఎలా లింక్ చేయవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ అనేది అందుతోంది. కేంద్ర ప్రభుత్వ 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని లక్షలాది మంది ప్రజలు కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. రేషన్ కార్డుతో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని ఏ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ షాప్ నుంచి అయిన కూడా సరుకులని చాలా ఈజీగా పొందవచ్చు.


ఇక ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ ని రేషన్ కార్డ్ తో లింక్ చేయడం ఎలా?


1. ఇక దీని కోసం ముందుగా మీరు ఆధార్ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లండి.

2. తరువాత ఇప్పుడు మీరు 'Start Now' పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మీరు చిరునామాను జిల్లా ఇంకా రాష్ట్రంతో నింపండి.

4. ఇప్పుడు 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై మీరు క్లిక్ చేయండి.

5. ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా ఇంకా అలాగే మొబైల్ నంబర్ మొదలైనవాటిని నింపండి.

6. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP అనేది మీకు వస్తుంది.

7. ఇక్కడ OTPని ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయిన మెస్సేజ్‌ చూస్తారు.


ఆఫ్‌లైన్ లో లింక్ ఎలా చేయాలి?


మీకు కావాలంటే ఆఫ్‌లైన్‌లో కూడా రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును ఈజీగా లింక్ చేయవచ్చు. దీని కోసం మీరు రేషన్ కార్డు హోల్డర్ ఆధార్ కార్డు కాపీ ఇంకా రేషన్ కార్డు కాపీ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను తీసుకొని రేషన్ కార్డ్ సెంటర్‌లో సమర్పించాలి. మీకు కావాలంటే మీరు రేషన్ కార్డ్ సెంటర్‌లో మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ డేటా వెరిఫికేషన్‌ను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: