పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు  చేసారు.  బిజెపి కోర్ కమిటీ భేటీలో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చిస్తారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు అని అన్నారు. కాని దానికి విరుద్ధంగా మతతత్వం పై చర్చించారు అని విమర్శలు చేసారు. రథయాత్ర ఎందుకు చేస్తున్నారు..రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా ? అని నిలదీశారు. అంతర్వేది ఘటన పై సిబిఐ ఎంక్వయిరీ వేసాము ఇప్పటి వరకు ఎందుకు స్టార్ట్ చేయలేదు అని నిలదీశారు. బిజెపిలో ఉన్న వాళ్ళే హిందువుల్లా మాట్లాడుతున్నారు..మిగిలిన వాళ్ళు హిందువులు కాదా అని ప్రశ్నించారు.

అయోధ్య సమస్య ఎవ్వరు తీర్చలేకపోయిన మోడి హయాంలో సమస్య తీరింది అది నాయకత్వం అని అన్నారు. అలాంటి నాయకత్వం జగన్ లో ఉంది అని ఆయన పేర్కొన్నారు. హంగులు అర్బటాలు లేకుండా ప్రజలు సంక్షేమం కోసం జగన్ పాటు పాటుపడుతున్నారు అని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో దేవాలయాల తొలగించినప్ఫుడు మీ పార్టీ వ్యక్తే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు అని ఆయన వెల్లడించారు. అప్పుడు మీరు ఎందుకు మాట్లడలేదు అని ప్రశ్నించారు. దేవాలయాల కూల్చే చంద్రబాబు మీకు దేవుడా అని నిలదీశారు.

రథయాత్ర ఎందుకు చేస్తున్నారో మరోసారి ఆలోచించండి అని సూచించారు. సోషల్ మీడియాలో మతవిధ్వేశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. వరదలు తుఫాన్లు సమయంలో రాష్ట్రం సహయం చేస్తే కేంద్రం నుండి ఒక్క రూపాయి తీసుకురాలేదు అని మండిపడ్డారు. రాష్ట్ర రైతులు సహాయం పై మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. మీరు మతాలు ప్రాంతాలు మధ్య విధ్వేశాలు కలిగిస్తే ఈ ప్రాంత ప్రజలు సహించారు అని అన్నారు. రాముడు ముందు పుట్టాడా,బిజెపి ముందు పుట్టిందా రాముడు అందరి వాడు...మేము ఉదయం నుండి రాముడ్ని స్మరిస్తాం అని అన్నారు.  క్రీస్మస్ శుభాకాంక్షాలు చెప్పినా రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: