ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వారిలో ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఒకరు.. అయితే ఈ రోజున వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం అంటూ చేపట్టిన కార్యక్రమంలో కార్యకర్తలు నేతలు కూడా ఏపీ అంతట పాల్గొన్నారు. అలా విశాఖపట్నంలో  వైసిపి కార్యక్రమంలో పాల్గొన్న బొత్స అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు. దీంతో వైసిపి నేతలు వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి మరి వైద్యాన్ని అందించారు.ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న అభిమానులు ,కార్యకర్తలు నేతలు ఊరట కల్పించేలా తాజాగా బొత్స ఆరోగ్యంపై వైసీపీ పార్టీ ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.



బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అంతేకాకుండా ఆసుపత్రిలో బొత్స నడుస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని కూడా షేర్ చేశారు. బొత్స ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా ఫోన్లు రావడంతో అందరికీ తెలిసేలా ఇలా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు. బొత్స గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో వైసిపి ఎమ్మెల్సీగా గెలిపించుకొని మరి మండల విపక్ష హోదాని సైతం సంపాదించారు.


ఉత్తరాంధ్ర రాజకీయాలలో కీలకమైన నేతగా ఉన్న బొత్స గతంలో గుండె ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో ఈ రోజున ఆయన ఒక్కసారిగా ఇలా కుప్పకూలడంతో ఏం జరిగిందా అంటూ పలువురు వైసిపి శ్రేణులు ఆందోళన చెందారు.అయితే చివరికి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కోలుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మరి ఇంటికి వెళతారా లేకపోతే వైద్యుల సంరక్షణలోనే ఉంటారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అటు ఒకవైపు అధికార ప్రభుత్వం మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మధ్య ఏదో ఒక విషయంలో వార్ కనిపిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: