
ఈ మొత్తం ఖాళీలలో సింహభాగం పోలీస్ శాఖలోనే ఉండనుంది. సమాచారం మేరకు, పోలీస్ శాఖలో 17,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. దీనితో పాటు, రాష్ట్రంలోని విద్యాశాఖలో కూడా భారీ నియామకాలు జరగనున్నాయి. టీచర్ ఉద్యోగ ఖాళీలతో పాటు కాలేజీలలో లెక్చరర్ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నియామకాల ప్రక్రియ వేగవంతం కానుండడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం పోలీసు, విద్యా శాఖలే కాకుండా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా భర్తీ అయ్యే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్లు సైతం త్వరలోనే విడుదల కానున్నాయని సమాచారం. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. మొత్తంమీద, రెండు నెలల కాలంలో 25,000 ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర యువతలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు మేలు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు