ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. కాగా రాజస్థాన్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతు ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ చెట్టు పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించడం ఎంతో కీలకం అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ పై కూడా అటు ఐపీఎల్ ప్రేక్షకుల అంచనాలు పెట్టుకుంటున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.


 గత కొన్ని మ్యాచ్ ల నుంచి వరుసగా ఓటమి చవి చూస్తున్నా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో పుంజుకోవాలని భావిస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. కానీ మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం ఇటీవలే జ్వరం కారణంగా హాస్పిటల్ పాలు అయ్యాడు అనే విషయం తెలిసిందే.  దీంతో అతని స్థానంలో ఇక తెలుగు కుర్రాడు కె ఎస్ భరత్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఐపీఎల్ లో అటు తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ కు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది అన్న విషయం తెలిసిందే.



 ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించాలంటే ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ పరుగుల వరద పారిస్తున్న రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ ను కంట్రోల్ చేసేందుకు అటు కెప్టెన్ రిషబ్ పంత్ ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నాడు అన్నది కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏడు విజయాలతో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీ పై విజయం సాధిస్తే 16 పాయింట్లు సాధిస్తోంది. రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిస్తేనే ప్లేఆఫ్ రేసులో నిలబడ గలుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl