తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలోకి వచ్చి తన బ్యాటింగ్ విధ్వంసంతో సచిన్ వారసుడు అనే ఒక ప్రత్యేకమైన ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నాడు పృథ్వి షా. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు ఫ్యూచర్ స్టార్  అతనే అంటూ అందరూ నమ్మడం కూడా మొదలుపెట్టారు. కానీ తక్కువ సమయంలోనే నిలకడలేమిటో ఇక జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. అయితే ఇక గత కొంతకాలం నుంచి దేశవాళి క్రికెట్లో బాగా రాణిస్తున్న అతనికి భారత జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు.


 ఇండియా ఆడిన ప్రతి సిరీస్ సమయంలో తనకు చోటు దక్కుతున్న ఎంతో ఆశగా ఎదురు చూడటం చివరికి నిరాశతో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నాడు. అయితే ఇలా టీమ్ ఇండియాలోకి తనను ఎంపిక చేయడం లేదు అన్న కసితో ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా తన బ్యాట్ తో దంచి కొడుతున్నాడు అని చెప్పాలి. సెంచరీలు డబుల్ సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల ఏకంగా త్రిబుల్ సెంచరీ  తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఇక పృథ్వి షా చెలరేగిపోతున్న తీరు చూస్తే అతను 400 స్కోర్ సాధించడం కూడా కష్టమేమీ కాదు అని అందరూ భావించారు. కానీ 400 పరుగులకు కొన్ని పరుగుల దూరంలోనే అతను ఆగిపోయాడు.


 ఇకపోతే ఇటీవలే రంజి ట్రోఫీలో భాగంగా రెండో అత్యధిక స్కోరు సాధించిన పృథ్వి షాపై బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రశంసలు కురిపించాడు. పృద్విషా ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. అతడు అపారమైన సామర్థ్యం కలిగిన ప్రతిభావంతుడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అతన్ని చూసి గర్వపడుతున్న అంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన పృథ్వి షా  మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. లక్ష్యాన్ని చేరుకునేంతవరకు కష్టపడుతూనే ఉంటాను అంటూ పృథ్వి షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: