ఇక మార్చి 17 వ తేదీ నుంచి ఇండియా - ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ జరగుతుంది. ఇప్పటికే రెండు జట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న లక్ష్యంతో అటు ఆసీస్.. ఇటు ఇండియా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే మన టీమ్ ఇండియా ఇప్పుడు ఏ ప్లేయర్స్ తో దిగుతుంది? కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టు కెప్టెన్ బాధ్యతలను తీసుకోబోతున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత రవీంద్ర జడేజా మళ్లీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో ఫస్ట్ వన్డేకు టీమిండియా 5 మంది బ్యాట్స్‌మెన్లు, 3 ఆల్‌రౌండర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఇంకా అలాగే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.ఇక టీమిండియా ఓపెనింగ్ బాధ్యతల విషయానికి వస్తే శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్‌.. మూడో స్థానాన్ని విరాట్ కోహ్లీ ఇంకా నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. ఇక తరువాత ఫినిషర్‌గా కేఎల్ రాహుల్ ఆడవచ్చు. మరి ఇంతకీ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా ఇషాన్ కిషన్ చేస్తాడా అనేది ప్రశ్న.


ఇక రేపు ఆడబోతున్న భారత జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్ల పాత్రలను కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇంకా వాషింగ్టన్ సుందర్ పోషించనున్నారు. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు మహ్మద్ షమీ ఇంకా మహ్మద్ సిరాజ్‌లపై ఆధారపడతాయి.ఇక కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రంగంలోకి దిగవచ్చు.ఇక టీం విషయానికి వస్తే..శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఇంకా అలాగే మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు.ఇక ఆసిస్ టీం విషయానికి వస్తే..ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్/మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా ఇంకా అలాగే మిచెల్ స్టార్క్ ఆసిస్ తరపున ఆడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: