గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది. చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది తెలియని విధంగా ప్రేక్షకులు అందరినీ కూడా మ్యాచ్ ఉత్కంఠ మునివేళ్లపై నిలబెడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో ఇలాంటి ఉత్కంఠను ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇదే రీతిలో ఎంతో ఉత్కంఠగా సాగింది అన్న విషయం తెలిసిందే.



 రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో చివర్లో రవీంద్ర జడేజా మహేంద్రసింగ్ ధోని సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి ఎంతో దూకుడుగా ఆడినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన పోరూలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే రాజస్థాన్ ఈ విజయం ద్వారా అటు పాయింట్లు పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది అని చెప్పాలి. ఇక ఇలా రాజస్థాన్ జట్టు విజయంతో పాటు పాయింట్లు పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ జట్టు కెప్టెన్ సంజూ  మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.



 ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో  సంజు  డకౌట్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు. దీంతో ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అత్యధిక సార్లు డెకౌట్ అయిన ప్లేయర్గా నిలిచాడు సంజూ.  రాజస్థాన్ తరఫున ఇప్పటివరకు ఎనిమిది సార్లు డకౌట్ అయ్యాడు అని చెప్పాలి. సంజు  తర్వాత షేన్ వార్న్, స్టువర్ట్ బిన్నీ ఏడు డకౌట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. ఐదు డక్ అవుట్లతో అటు అజింక్య రహానే మూడో స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఏమైనా జట్టు విజయం సాధించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl