ప్రతి మ్యాచ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరులోకి దిగుతూ.. భారీ స్కోర్లు చేస్తూ ఉన్నాడు యశస్వి జైస్వాల్. దేశవాళి క్రికెట్లో లాగానే ఐపీఎల్లో సైతం తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక మరోవైపు రింకు సింగ్ కూడా 2023 ఐపీఎల్ హీరోగా మారిపోయాడు. ఏకంగా ఒక మ్యాచ్ లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఐదవ స్థానంలో బ్యాటింగ్ దిగుతూ మంచి ఫినిషిర్ పాత్రను పోషిస్తున్నాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ టీమిండియా ఫ్యూచర్ స్టార్లు గానే కనిపిస్తున్నారు.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ లో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్, రింకు సింగ్ లను భారత జట్టుకు ఎంపిక చేయాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. సెలక్టర్లు వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టినట్లయితే.. యశస్వి జైష్వాల్ రింకు సింగ్ లాంటి ఆటగాళ్లను సిద్ధం చేయాలి. యువ ఆటగాలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఈ యాంగ్ ప్లేయర్స్ ని ఇప్పటినుంచి సిద్ధం చేయాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.