ఎందుకంటే ఇతర గ్రౌండ్లలో అద్భుతంగా సత్తా చాటి అదరగొడుతున్న టీంలు అటు హోమ్ గ్రౌండ్ లో మాత్రం తేలిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. దీంతో ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఇక ఊహ కిందన విధంగానే మారిపోయింది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఐపీఎల్ పోరు మరింత రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అటు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే నాలుగు జట్లు ఏవి అన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే నేడు మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది అని చెప్పాలి. ఐపిఎల్ లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి. అయితే నేడు మ్యాచ్లో తలబడుతున్న రెండు జట్లు కూడా పాయింట్లు పట్టికలో చివరి స్థానాలలో కొనసాగుతూ ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టు 12 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 పాయింట్లతో పదవ స్థానంలో ఉంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగింది అన్న విషయం తెలిసిందే. కాగా పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కి చేరాలి అంటే ఈ మ్యాచ్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ లో కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. దీంతోపాటు మిగతా జట్ల ఫలితాలు కూడా అటు పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను నిర్ణయిస్తాయి అని చెప్పాలి.