ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ అటు పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ఉంటే ఇక ఈసారి చెన్నై జట్టు కప్పు గెలవడం పక్క అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది అనే ఆనందం అభిమానుల్లో ఉన్నప్పటికీ ధోనీ చేస్తున్న పని మాత్రం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అదేంటి ధోని కెప్టెన్గా మంచి విజయాలు అందిస్తుంటే ఇంకా అభిమానులకు నచ్చకపోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ధోని ఆటను చూడాలని తహతలాడిపోతున్నారు ఫ్యాన్స్.
కానీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా ధోని కి సరిగ్గా ఆడే అవకాశం రావట్లేదు. చివర్లో ఒక్కో ఓవర్ ఉన్నప్పుడు లేదా మూడు నాలుగు బంతులు ఉన్నప్పుడు బ్యాటింగ్ కి వస్తున్న ధోని ఇక సిక్సర్లతో చెలరేగిపోతున్న.. ధోని ఆటను ఎక్కువ సేపు చూడాలన్న కల మాత్రం అటు అభిమానులకు తీరలేక పోతుంది. ఇక ఇటీవల ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోను ధోని చివర్లో నాలుగు బంతులు ఉన్నప్పుడు బ్యాటింగ్కి రాగా కేవలం 3 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఐదు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తున్న ధోనీకి ఇదే ఆ చివరి ఐపీఎల్ అంటున్న ప్రచారం నేపథ్యంలో ధోని ఆటను చూడలేకపోతున్నామని బాధ అందరిలో ఉంది. దీంతో ధోని ప్లీజ్ ఇలా చేయకు కాస్త ముందు బ్యాటింగ్ కి వచ్చి మా కోరిక తీర్చు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.