బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నది రోహిణి. ఈమె అసలు పేరు ఏమిటంటే రోహిణి రెడ్డి. ఇక అంతే కాకుండా ఈమెను ముద్దుగా రౌడీ పిల్ల అని పిలుస్తారు. అయితే ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.రోహిణి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నాగయ్య పేట లో జన్మించింది. ఈమె తండ్రి పేరు సింహాద్రి, తల్లి గోవిందమ్మ. ఈమెకు ప్రస్తుతం 30 సంవత్సరాలు వయసు. ఈమెకు ఒక సిస్టర్ కూడా ఉంది. ఈమె చదువు మొత్తం విజయవాడలోని పూర్తి చేసింది.చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఈమెకు జాబ్ రావడం జరిగింది. ఈ జాబ్ లో జాయిన్ అవ్వడానికి నాలుగు నెలలు వ్యవధి ఉండడంతో.. హైదరాబాద్  సిటీలోని ఒక కోచింగ్ సెంటర్ లో చేరింది.అలా హైదరాబాదులో కోచింగ్ సెంటర్ లో చేరినప్పుడు అక్కడ బాగా జోకులు వేయడంతో,అక్కడ వున్న ఒక వ్యక్తి .. ఒక సినీ ప్రముఖుల ద్వారా దూరదర్శన్ లో"తెలుగింటి అమ్మాయి"అనే షో కోసం డైరెక్టర్ గా చేస్తున్న వ్యక్తికి ఈమెను పరిచయం చేశాడు. తద్వారా ఈమె దూరదర్శన్ లో యాంకర్ గా చేసింది. ఇక జీ తెలుగులో ఒక ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ అయింది. ఇక అంతే కాకుండా మా టీవీలో ప్రసారమయ్యే శ్రీనివాస కళ్యాణం సీరియల్ లో కూడా నటించింది. అలా పలు నాటిక లతో బిజీగా మారిపోయింది.

చాలా బిజీగా ఉన్న సమయంలో 2016 లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక సంవత్సరం పాటు  అన్నింటికీ దూరంగా ఉంది రోహిణి. ఇక చాలా రోజుల తర్వాత జబర్దస్త్ షో ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది రోహిణి. ఇక అంతే కాకుండా 2019 లో బిగ్ బాస్ లో పాల్గొంది. ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈమెకు ఒక్కొక్క ఎపిసోడ్ కు 20 వేల రూపాయల వరకు ఇస్తారట. అంతేకాకుండా హైదరాబాదులో కోటి రూపాయలు విలువ చేసే ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇక ఈమెకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈమెకు చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున అంటే చాలా ఇష్టమట.



మరింత సమాచారం తెలుసుకోండి: