యమహా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ కంపెనీ అంటే అందరిలో కూడా ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా యువతకు ఈ బ్రాండ్ అంటే మంచి క్రేజీనెస్ ఉంటుంది. అందుకే ఆ కంపెనీ నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా చాలా ఆసక్తి కనబరుస్తారు.ఈమధ్య ఆటో రంగం అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్న నేపథ్యంలో యమహా కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్ లను లాంచ్ చేసింది. ముఖ్యంగా సిటీ అవసరాలకు ఇంకా అర్బన్ ప్రజలను లక్ష్యంగా చేసుకొని వీటిని లాంచ్ చేసింది. యమహా బూస్టర్ ఈజీ ఇంకా యమహా బూస్టర్ ఎస్ పెడెలెక్ పేర్లతో వీటిని లాంచ్ చేసింది.ఇక వీటిల్లో యమహా బూస్టర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ కాగా.. రెండోది యమహా బూస్టర్ ఎస్ పెడెలెక్ ఎలక్ట్రిక్ మోపెడ్.ఈ రెండు వాహనాలు యూరోప్ లో లాంచ్ అయ్యాయి. బూస్టర్ ఎస్ పెడెలెక్ మాక్సిమం గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది.ఇంకా అలాగే యమహా బూస్టర్ ఈజీ బైక్ మాక్సిమం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.


ఇందులో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 120 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇవి అల్యూమినియం యూ ఫ్రేమ్ ని కలిగి ఉంటాయి. వీటికి 20 అంగుళాల చక్రాలు ఇంకా కేవలం యమహాలోనే లభ్యమయ్యే ఫోర్క్ కవర్లు ఉన్నాయి. టైర్ మందం వచ్చేసి నాలుగు అంగుళాలు ఉంటుంది. ఇంకా అలాగే 180ఎంఎం డయామీటర్ డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయి.ఇక ఈ రెండు బైక్ లలో ఆటోమేటెడ్ అసిస్టెన్స్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇది కఠినమైన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మీకు అధిక శక్తిని అందిస్తాయి. బూస్టర్ ఈజీ టూ వీలర్ గంటకు మాక్సిమం 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది.ఇంకా అలాగే బూస్టర్ ఎస్ పెడెలెక్ మోపెడ్ గంటకు 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లో వెళ్లగలుగుతుంది. రెండు వాహనాల్లో కూడా మాక్సిమం టార్క్ 75ఎన్ఎం ఉంటుంది.ఈ రెండు వాహనాలు సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: