వికారాబాద్ జిల్లా:పరిగి మండలం కుదావంద్ పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని జులాయి కొడుకు దారుణంగా చంపేసాడు. తల్లి భీమమ్మ (55) మెడకు కరెంట్ వైరు బిగించి హత్య చేసిన ఘటన సంచలనం అయింది. రైతు బంధు, వితంతు పెన్షన్ కోసం నిత్యం తల్లితో గొడవ పడే వాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. పెస్షన్ డబ్బుల కోసం నిన్న రాత్రి తల్లితో గొడవ పడ్డాడు.

చంపేస్తే రైతు భీమా వస్తుందని భావించి హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. తనే హత్యచేసి తల్లిని ఎవరో చంపారంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసాడు. మద్యం సేవించి జులాయి గా తిరుగుతూ నిత్యం తల్లితో గొడవ పడేవాడని అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts