స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల కు గడువు ముగుస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన చేసింది. ఇక నామినేషన్ గడువు నేటితో ముగుస్తున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్ తెరాస పార్టీ అభ్యర్ధులను ఫైనల్ చేసారు. నిన్న నామినేషన్లు శంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ యాదవ రెడ్డి నామినేషన్ వేసారు.

ఈ రోజు కవిత, కసిరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, తాత మధు, దండే విఠల్ ఇతర జిల్లాల అధ్యక్షులు నామినేషన్ వేస్తారు. ఏడు స్థానాల్లో సిట్టింగ్ లకే ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఐదు స్థానాల్లో సిట్టింగ్ లకు హ్యాండ్... కొత్త వారికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. పోటీ పై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుందని కూడా తెలుస్తుంది. మెదక్, ఖమ్మంలో పోటీ పై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చిందని సమాచారం. మెదక్ అభ్యర్థిగా జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts