క‌రోనా మ‌హ‌మ్మారీ కాస్త త‌గ్గింద‌నుకునే లోపే త‌న రూపాన్ని మార్చుకుని మ‌రొక రూపంలో ఒమిక్రాన్‌.. ఇలా కొవిడ్‌-19 రూపంలో ఉగ్ర‌రూపాన్ని దాల్చుతున్న‌ది. గ‌త రెండు ఏండ్ల కాలం నుంచి క‌రోనా క‌ష్టాలు తెచ్చిపెడుతుంది. సామాన్య‌ప్ర‌జ‌లు, సెలెబ్రిటీలు ఇలా ఎవ్వ‌రినీ కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు కొవిడ్‌-19. ఇప్ప‌టికే క‌మ‌ల్‌హాస‌న్ ఫారిన్ ట్రిప్ త‌రువాత క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం విధిత‌మే. ఇవాళ టాలీవుడ్ అగ్ర‌హీరోయిన్‌ల‌లో ఒక‌రైన స‌మంత సైతం నిన్న క‌డ‌ప ట్రిప్‌కు వెళ్లి వ‌చ్చిన త‌రువాత జ‌లుబు రావ‌డంతో ఆసుప్ర‌త్రికి వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ది.

ఆమె అభిమానుల‌లో ఆందోళ‌న త‌గ్గ‌క‌ముందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ ఖాన్‌కు క‌రోనా సోకింది. క‌రీనాతో పాటు ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. వాళ్లిద్ద‌రూ క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించి ప‌లు పార్టీల‌కు హాజ‌ర‌య్యార‌ని.. ఇద్ద‌రు న‌టీమ‌నుల‌ను ఈ మ‌ధ్య‌కాలంలో క‌లిసిన వ్య‌క్తులు ఆర్‌టీసీఆర్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్ప‌రేష‌న్ ఆదేశించిన‌ది. ఇక సెలెబ్రిటీలే ఇలా నిబంధ‌న‌లు ఉల్లంఘించి వ్య‌వ‌హ‌రిస్తే.. సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. త‌మ అభిమానుల‌కు స్పూర్తిని ఇచ్చేలా ఉండాల్సిన కొంద‌రు సెలెబ్రిటీలు వాళ్ల‌తోనే చెప్పించుకునే ప‌రిస్థితికి వ‌స్తున్న‌ది. ఇలాగే కొన‌సాగితే క‌రోనా మ‌రొక‌సారి తీవ్ర‌రూపం దాల్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: