తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బిజెపి సీనియర్ నాయకులు, మార్గదర్శకులు జంగారెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు.


చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు  శ్రీ జంగా రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారని.. వారి పార్థివదేహాన్ని హైదరాబాద్ నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉంచి పార్టీ కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జంగారెడ్డి గారి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జంగారెడ్డి గారి మృతి పార్టీకి తీరనిలోటు అని ఈటల రాజేందర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: