తిరుమలలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా చెప్పులతో నడిచి.. ఫోటో షూట్‌ చేసుకున్న నటి నయనతార దంపతులు ఇప్పుడు సారీ చెబుతున్నారు. నిన్న పాద రక్షలు వేసుకొని శ్రీవారి ఆలయం మాడ వీధుల్లో తిరిగి ఫోటో షూట్ లో నిలబడ్డారు. అయితే.. మాడ వీధుల్లో పాద రక్షలను వేసుకొని తిరగడం ఎప్పటి నుంచో టీటీడీ నిషేధించింది. నిన్న నటి నయనతార, విఘ్నేష్ శివన్ నూతన దంపతులు శ్రీవారి  కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం మాడ వీధుల్లో ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నటి నయనతార పాద రక్షలు వేసుకొని ఆలయం ఎదుట కనిపించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ అధికారులు కూడా స్పందించారు. నయనతార దంపతులకు నోటీసులు ఇస్తామన్నారు. దీంతో ఇప్పుడు నయనతార భర్త విఘ్నేష్ క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు. తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయన్న విషయం మరిచిపోయామని.. తెలియక చేసిన తప్పును మన్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: