ఐఏఎస్‌ అధికారి అంటే.. అదో హోదా.. లక్షల్లో జీతాలు.. పరపతి సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటి కీలక వ్యక్తులు.. తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలో లక్షలు ఫీజులు కట్టి చదివిస్తుంటారు. కానీ.. ఏపీలో ఓ ఐఏఎస్‌ మాత్రం తన పిల్లలను గవర్నమెంట్‌ స్కూల్లో చేర్పించారు. ఏపీ ఐఏఎస్‌ అధికారి శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తమ ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.


ఇప్పుడు ఏపీలోని పాఠశాలల్లో అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. అందుకే.. విజయవాడ పటమటలోని బసవపున్నయ్య జడ్పీ  హైస్కూల్ లో తన పిల్లలను చేర్పించారు . ప్రభాకర్ రెడ్డి కుమార్తె 8 వ తరగతి కాగా.. కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం హైస్కూల్ లో ఆంగ్ల మాథ్యమంలో విద్యాబోధన ఉండటం వల్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు, వసతులు బాగున్నాయని మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: