గణేశ్‌ లడ్డూ వేలంపాటలలో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకత ఉంది. ఏటా ఈ పాట పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రూ.25 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. అయితే.. ఈ ఏడాది ఒకచోట ఏకంగా గణేశ్ లడ్డూ రూ60 లక్షలు పలికింది. ఎక్కడో తెలుసా.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌లోని సన్‌సిటీ కీర్తి రిచ్‌మండ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాస్‌లో ఈ రికార్డు ధర పలికింది. ఇక్కడి గణనాథుని లడ్డూకు రూ. 60 లక్షల ధర పలికింది.


వేలం పాటలో అదే ప్రాంతానికి చెందిన ఆర్వీ చారిటబుల్‌ ట్రస్ట్‌  రూ.60.83 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎన్జీవోస్‌కు ఫండ్స్‌ రూపంలో అందిస్తామని రిచ్‌మండ్‌ విల్లాస్‌ ప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకూ గణేశ్‌ లడ్డూకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అలాగే అల్వాల్‌ పరిధి కానాజిగూడలోనూ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఇక్కడి లక్ష్మీగణపతి ఆలయ లడ్డు ఏకంగా రూ.45,99,999 పలికింది. హిమాయత్‌నగర్‌ వాసి వెంకట్రావు, గీతాప్రియ ఈ లడ్డూను వేలంలో కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: