ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీని పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్ రూపొందించారు. ఈ నెల 22నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలో సమావేశాలు నిర్వహించబోతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ సమావేశమై అక్కడి సమస్యలపై చర్చిస్తారు. సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా నిలబడే విధంగా పార్టీని పటిష్టపరచడంపై కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 13న విజయనగరానికి సమీపంలోని గుంకలాంలో  పేదల ఇళ్ల నిర్మాణాల పరిశీలకు వెళ్లినప్పుడు అక్కడి యువకులతో పవన్ మాట్లాడారు.


వలసలు, పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నట్లు వారు చెప్పారట. ఒకప్పుడు జిల్లాకే తలమానికంగా ఉన్న జ్యూట్ పరిశ్రమలు, భీమసింగి చక్కెర కర్మాగారం మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారట. తోటపల్లి నిర్వాసితుల సమస్యలు, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ పనులు ఒక్క అడుగు ముందుకు పడడం లేదట. గిరిజన విద్య మిధ్యగా మారిందట. ఇవన్నీ పరిష్కరించగలిగే సమస్యలేనని.. అయినా పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవటం వల్లే అలాగే ఉన్నాయని పవన్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: