ఇక అమెరికాకు చెందిన PwC 'Pulse: Managing business Risks in 2022' సర్వే ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కంపెనీలు కనీసం 50 శాతం మంది ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా అదే సమయంలో కంపెనీలు తమ భవిష్యత్తు కోసం ఉద్యోగుల నైపుణ్యాలను కూడా పెంచుకునేలా చర్యలు తీసుకుంటున్నాయని ఈ నివేదికలో పేర్కొంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్ మెంట్ విషయంలో కంపెనీలు చాలా ఉధృతంగా వ్యవహరించాయి. అయితే ఇఫ్పుడు మాత్రం బాగా ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు.ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్ కంపెనీలు 50 శాతం హెడ్‌కౌంట్‌ను తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇంకా అలాగే 46 శాతం మందికి బోనస్‌లను తగ్గించడంతో పాటుగా, 44 శాతం మందికి కూడా ఆఫర్‌లను రద్దు చేస్తున్నారని నివేదిక వెల్లడించింది.మైక్రోసాఫ్ట్, మెటా (గతంలో ఫేస్‌బుక్) వంటి పెద్ద టెక్ కంపెనీలతో సహా యుఎస్‌లో జూలై నెల నాటికి 32,000 మంది టెకీలను తొలగించారు. దీంతో టెక్ సెక్టార్‌ అనేది చాలా అధ్వాన్నంగా మారనుంది. అటు మనదేశంలో, కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, 25,000 కంటే ఎక్కువ మంది స్టార్టప్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం మొత్తం 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.ఇంకా కొన్ని పరిశ్రమల్లో ఈ ముందస్తు జాగ్రత్తలు ఎక్కువగా ఉన్నాయని పీడబ్ల్యూసీ తన రిపోర్టులో తెలిపింది.


అలాగే మరోవైపు టెక్నాలజీ, మీడియా ఇంకా అలాగే టెలికమ్యూనికేషన్ కంపెనీలు, తమ ఉద్యోగుల కొరతను పరిష్కరించడానికి ఆటోమేషన్‌లో పెట్టుబడి పెట్టేందుకు చాలా ఎక్కువ ప్రయత్నిస్తాయని PwC నివేదిక పేర్కొంది. ఇంకా అదే సమయంలో, హెల్త్‌కేర్ ఇతర పరిశ్రమల కంటే పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవడంపై మరింత దృష్టి కూడా సారిస్తోంది.ఇక ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. తమ రెవెన్యూలు తగ్గడంతో ఇప్పటికే యాపిల్ సంస్థ నూతన రిక్రూట్ మెంట్లను కూడా నిలిపివేస్తూ, ఏకంగా మొత్తం 110 రిక్రూటర్లను తొలగించింది. ఇంకా అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్ సైతం నూతన రిక్రూట్ మెంట్ నిలిపివేయడంతో పాటు, ఉద్యోగుల తొలగింపుపై పూర్తి దృష్టి కేంద్రీకరించాయి.ఇంకా మరోవైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం అటు మార్కెట్ డిమాండ్ పై కూడా పడే అవకాశం చాలా ఉంది. కంపెనీలు తమ మ్యాన్ పవర్ కనుక తగ్గించుకుంటే, ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు అటు సేవా రంగంలోనూ, ఇంకా ఉత్పత్తి రంగంలోనూ డిమాండ్ కు తగిన సప్లై చెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని, దాంతో పాటు నిరుద్యోగిత పెరిగితే ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: