ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎటు చూసినా ఆడ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు కనిపిస్తున్నారు నేటి సభ్య సమాజంలో. దీంతో మానవత్వం ఉన్న మనిషి విచక్షణతో ప్రవర్తించే మనుషులు ఎక్కడ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఏకంగా గొప్ప వృత్తిలో కొనసాగుతున్న వారు సైతం నీచంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న లైంగికవేధింపుల ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 ఇక ఆడ పిల్లల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. బాలికతో ఫిజియోథెరపిస్టు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారిపోయింది. గంగవరం మండలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మండలం లోని ఓ గ్రామానికి చెందిన బాలికకు వారం రోజుల క్రితం చేతికి దెబ్బ తగిలింది. వైద్యుల సూచన మేరకు స్థానిక మదనపల్లి రోడ్డు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీస్ట్ మధుసూదన్ వద్ద చికిత్స తీసుకుంటుంది బాలిక. ఈ క్రమంలోనే ఇటీవల చికిత్స నిమిత్తం బాలిక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్లగా.. ఫిజియోథెరపిస్ట్ లో ఉన్న కామాంధుడు బయటికి వచ్చాడు. దీంతో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.


 ఈ విషయం బాలిక తండ్రికి చెప్పగా తండ్రి వెళ్లి ఫిజియోథెరపీస్ట్ ను ప్రశ్నించడంతో ఇక బాలిక తండ్రి పై దాడి  చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న గ్రామస్తులు అందరిని కూడా సముదాయించి ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: