
చిన్నపాటి గొడవకే కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి ఓ యువకుడిని నడిరోడ్డు పైనే దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఢిల్లీలోని నంగులు ఏరియాకు చెందిన విశాల్ మాలిక్ అనే యువకుడు ఉదయం సమయంలో జిమ్కు వెళ్లి తిరిగి వస్తుండగా దారి వెంట నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తికి పొరపాటున బైక్ తగిలింది. దీంతో స్థానికంగా ఉన్న పదిమంది వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. అయితే వారి నుంచి తప్పించుకున్న విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారు పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిన విషయాన్ని తన అన్న సాహిల్ మాలికకు చెప్పాడు విశాల్. అయితే కోపంతో ఊగిపోయిన సాహిల్ ఇక అక్కడే తమ్ముడు వదిలేసిన బైక్ తెచ్చేందుకు వెళ్లాడు. అయితే ఇలా వెళ్లిన సాహిల్ పై కూడా అక్కడున్న వ్యక్తులు దాడికి దిగారు. అంతటితో ఆగకుండా కత్తితో కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు అతని కాపాడి ఇక ఆసుపత్రికి తరలించిన మార్గమధ్యమంలోనే విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బాధిత యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.