రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన తర్వాత రష్యాపై అమెరికా విపరీతమైన ఆంక్షలను విధించింది. రష్యాకు చెందిన బిలియనీర్లకు సంబంధించిన ఆస్తులను ప్రీజ్ చేశారు. షిప్పులను స్వాధీనం చేసుకున్నారు. రష్యా కు చెందిన ఎన్ని ఆస్తులు ఉన్న వాటిని అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీన్ని బిలియనీర్ల వద్ద కూడా రూపాయి లేని పరిస్థితి ఏర్పడింది.


ఇలాంటి ప్రీజింగ్ విధానాన్నే యూరప్ దేశాలు అనుసరించాయి. అయినా రష్యా యుద్ధాన్ని ఎక్కడా తగ్గకుండా చేస్తోంది. ప్రస్తుతం జరిగిన జీ 7 దేశాల సదస్సులో అమెరికా మాట్లాడుతూ.. రష్యాకు పూర్తిగా ఎగుమతులు ఆపాలని నిర్ణయించింది. దీంతో రష్యా కూడా ఒక అడుగు ముందుకేసి ఒక నిర్ణయానికి వచ్చింది. రష్యా లో ఉన్న అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు, ఇతర యూరప్ దేశాలకు చెందిన కంపెనీలకు చెందిన డబ్బులన ప్రీజ్ చేసింది. అమెరికా, యూరప్ దేశాలే కాదు మేం కూడా ప్రీజ్ చేయగలమని నిరూపించింది.


ఈ విధమైన నిర్ణయాలతో అమెరికా, రష్యా మధ్య రోజు రోజుకు మరింత దూరం పెరుగుతోంది. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉన్న రష్యా ను మరింత దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది అగ్రరాజ్యం. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే విధంగా ఫిన్లాండ్, జర్మనీలకు చెందిన ఎనర్జీ ప్లాంట్లను స్వాధీనం చేసేసుకుంది. జీ 7 రిపోర్టుల ప్రకారం.. మరిన్ని ఆంక్షలు విధించాలని చూసిన యూరోప్ దేశాలకు చెందిన ఫిన్లాండ్, జర్మనీలకు చెందిన వాటిని స్వాధీనం చేసుకుంది.


గతంలో అమెరికాలో ఉన్న రష్యా బ్యాంకుల్లో ఉన్న డబ్బులను ఫ్రీజ్ చేయడమే కాకుండా చాలా ఆస్తులను అమ్మేసింది. ఆ వచ్చిన డబ్బులను ఉక్రెయిన్ లో ధ్వంసమైన చోట్ల పునరావాసం ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. కానీ ఇది అమెరికా సొంతంగా ఇచ్చిన డబ్బులు కావని తెలుస్తోంది. రష్యా ఆస్తులు అమ్మి వాటిని ఇచ్చి అమెరికా ఏదో త్యాగం చేసినట్లు చేయడం ఇది సరైన విధానం కాదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: