
గోదావరి నదిలో తెలంగాణకు ఇప్పటికే 968 టీఎంసీల హక్కు ఉందని, సముద్రంలో కలిసే 3000 టీఎంసీలలో 1950 టీఎంసీలు కేటాయించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారని హరీశ్ గుర్తు చేశారు. అయితే, రేవంత్ రెడ్డి ఈ వాటాను 1000 టీఎంసీలకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం కేసీఆర్ ట్రైబ్యునల్లో పోరాడుతుండగా, రేవంత్ 500 టీఎంసీలతో సరిపెట్టాలని చూస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రైతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే చర్యగా పేర్కొన్నారు.
కృష్ణా జల హక్కులపై సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో 299 టీఎంసీలకే పరిమితమైన ప్రాజెక్టులు ఉన్నాయని, అయినప్పటికీ కేసీఆర్ 405 టీఎంసీల తాత్కాలిక కేటాయింపు కోసం పోరాడారని హరీశ్ స్పష్టం చేశారు. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్లో సెక్షన్ 3 కింద కొత్త నిబంధనలతో 763 టీఎంసీల కోసం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ వాటా సాధించే అవకాశం ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో డిమాండ్ చేయకపోవడం దారుణమని విమర్శించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు