సాదారణంగా మసాలా వంటలు ఎండుమిర్చితో చేసిన కారాన్ని వేసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుంది. కానీ ఎండు కారం బదులుగా పచ్చిమిర్చి వాడటం మూలానా మన శరీరానికి ఎన్నో పోషకాలు పుష్కళంగా అందుతాయి.రోజు వారి ఆహారంలో పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కళంగా ఉంటుంది.కావున ఇది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా హై బీపితో బాధపడే వారు పచ్చిమిర్చిని రోజూ వారు డైటీ లో వాడితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
రక్తహీనతతో బాధపడే వారు రోజుకొక పచ్చిమిర్చిని తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. అలాగే ఇందులో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే గుణం ఉంటుంది.ఇది రక్తప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరస్తుంది. అదే విధంగా పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
గాయాలు తగిలినప్పుడు రక్తస్త్రావాన్నీ నివారిస్తుంది.ఇందులో ఉండే మెగ్నీషియం కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ వ్యాధి బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.పచ్చిమిర్చిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలాజిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడానికి సహాయపడి,చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మం అందంగా, మెరుగ్గా తయారవుతుంది.పచ్చిమిర్చీని తగిన మొతాదులో వాడటం మంచిదేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.