ముందుగా కన్నడనాట కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా చిత్ర సీమకు అడుగుపెట్టిన రష్మిక మందన్న, ఆ సినిమా సక్సెస్ తరువాత, టాలీవుడ్ కి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. యువ నటుడు నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ విధంగా టాలీవుడ్ లో కూడా ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొట్టిన రష్మిక ఆపై, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమాలో నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తెలుగులో రష్మికకు బాగా క్రేజ్ పెరగడంతో పాటు అవకాశాలు కూడా ఊపందుకున్నాయి. 

IHG

ఆ తరువాత మరొక్కసారి విజయ్ సరసన ఆమె నటించిన డియర్ కామ్రేడ్ యావరేజ్ విజయాన్ని అందుకుంది. అలానే నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కిన దేవదాస్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన రష్మిక, ఆ సినిమాతో మాత్రం ఫ్లాప్ ని చవిచూసింది. ఇకపోతే ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి, ఆ సినిమాతో మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. దానితో పాటు ఈ ఏడాది నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ లో కూడా నటించి దానితో కూడా విజయాన్ని దక్కించుకుంది రష్మిక. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్పలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక, మరోవైపు తమిళ్ లో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. 

 

ఇక లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి వినపడుతున్న గుసగుసలు బట్టి, కొద్దిరోజుల క్రితం రష్మిక ఏకంగా రెండు బడా మూవీస్ ని తన ఖాతాలో వేసుకుందని అంటున్నారు. టాలీవుడ్ లో, అలానే కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు అతి త్వరలో నటించబోయే సినిమాల్లో రష్మికని హీరోయిన్ గా ఎంపిక చేసారని, అందుకే నేడు పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రష్మిక ఎంతో ఆనందంతో కనబడుతోందని అంటున్నారు. కాగా ఈ రెండు సినిమాలకు సంబందించిన అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, రష్మిక రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: